News March 20, 2025

ఉమ్మడి కరీంనగర్: బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-2026 ఏడాదికి 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. http://www.mjptbcadmissions.org లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు తెలిపారు. ఎప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 6,832 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు.

Similar News

News December 7, 2025

విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన లెక్చరర్

image

శ్రీకాళహస్తిలోని రిపబ్లిక్ క్లబ్ వద్ద గల ఓ ప్రైవేట్ కళాశాల తెలుగు లెక్చరర్ విద్యార్థినిని వాతలు పడేటట్లు కొట్టాడు. స్థానిక గోపాలవనం వద్ద నివాసం ఉంటున్న అనీస్ అనే విద్యార్థి శనివారం కళాశాలకు వెళ్లాడు. అక్కడ తెలుగు లెక్చరర్ విద్యార్థి పేరాగ్రాఫర్ రాయలేదని బెత్తంతో వాతలు పడేటట్లు కొట్టాడు. కళాశాల యజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News December 7, 2025

KMR: గుర్తులొచ్చేశాయ్.. ఇక ప్రచారమే లక్ష్యం!

image

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం శనివారంతో ముగిసింది. పలు మండలాల్లో పోటీ నుంచి పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో ఎన్నికల వేడి జిల్లాలో మరింత రాజుకుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచార రంగంలోకి దిగారు.