News March 2, 2025
ఉమ్మడి కరీంనగర్: 4 నుంచి 6 వరకు ట్రైనింగ్

DSC 2024 ద్వారా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, LP, PD, PETలకు ఈనెల 4నుంచి 6వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్కు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైనింగ్కి వచ్చే టీచర్లు వారివెంట పాఠ్య పుస్తకాలు తీసుకొని రావాలని చెప్పారు.
Similar News
News November 28, 2025
సిరిసిల్ల: ఇంటర్వ్యూ కావాలని పిలిచి.. హతమార్చి..!

పీపుల్స్ వార్ పార్టీ మాజీ నక్సలైట్ బల్లెపు నరసయ్య అలియాస్ సిద్ధయ్య(బాపురెడ్డి) <<18408780>>హత్య<<>> ఘటనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాను దళంలో ఉన్నప్పుడు చంపినవారి వివరాలను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో, బాధిత కుటుంబానికి చెందిన జక్కుల సంతోశ్ తనకు ఇంటర్వ్యూ కావాలని సిద్ధయ్యను అగ్రహారం గుట్టల వద్దకు రప్పించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 28, 2025
మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.
News November 28, 2025
సత్యసాయి: బాలుడిని చంపింది ఇలా.!

NP కుంటలో హర్షవర్ధన్(4)ను మేనమామ<<18400825>> ప్రసాద్ హత్య చేసిన విషయం <<>>తెలిసిందే. బుధవారం బాలుడిని అంగన్వాడీ నుంచి ఇంటికి పిలిపించుకుని బైక్పై తోటలోని బావ వద్దకు తీసుకెళ్లి పలకరించి ఇంచికి వచ్చాడు. చెల్లెలు చంద్రకళ, మేనకోడలితో మాట్లాడి బాలుడికి రూ.20 ఇచ్చి అంగడికి పంపాడు. తర్వాత వెళ్తున్నానని చెల్లితో చెప్పి ఆడుకుంటున్న బాబును బైక్పై ఎక్కించుకుని గౌకనపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు.


