News March 2, 2025

ఉమ్మడి కరీంనగర్: 4 నుంచి 6 వరకు ట్రైనింగ్

image

DSC 2024 ద్వారా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, LP, PD, PETలకు ఈనెల 4నుంచి 6వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైనింగ్‌కి వచ్చే టీచర్లు వారివెంట పాఠ్య పుస్తకాలు తీసుకొని రావాలని చెప్పారు.

Similar News

News December 15, 2025

జనవరిలో భారీ ఓపెనింగ్స్.. ప్రిపేర్ అవ్వండి!

image

డిసెంబర్ ‘డ్రై మంత్’ ముగియగానే జనవరిలో ఐటీ కంపెనీలు భారీ నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇయర్ ఎండ్ ఆడిట్‌లు, బడ్జెట్ ప్రణాళికలు పూర్తవడంతో డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ఆగిపోతాయి. జనవరి ఓపెనింగ్స్ కోసం HR టీమ్స్ ప్లాన్ చేసుకుంటాయి. రాబోయే నోటిఫికేషన్‌లు, లక్ష్యంగా చేసుకోవాల్సిన కంపెనీలపై ప్రణాళిక వేసుకొని సిద్ధంగా ఉండాలి’ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. SHARE IT

News December 15, 2025

ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

image

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.

News December 15, 2025

సంగారెడ్డి: గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు

image

గంజాయి కేసులో నలుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరికిషన్ తెలిపారు. 2019లో గంజాయిని తరలిస్తూ నిఖిల్, శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్ అరెస్టు అయ్యారు. నేరం రుజువు కావడంతో జడ్జి వారికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.