News March 2, 2025

ఉమ్మడి కరీంనగర్: 4 నుంచి 6 వరకు ట్రైనింగ్

image

DSC 2024 ద్వారా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, LP, PD, PETలకు ఈనెల 4నుంచి 6వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైనింగ్‌కి వచ్చే టీచర్లు వారివెంట పాఠ్య పుస్తకాలు తీసుకొని రావాలని చెప్పారు.

Similar News

News November 17, 2025

పుల్కల్: అత్తారింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

image

అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పుల్కల్ మం.లో జరిగింది. స్థానికుల వివరాలు.. పెద్దారెడ్డిపేట వాసి పట్నం ప్రవీణ్‌కు వట్పల్లి మం. బిజిలిపూర్‌కు చెందిన లక్ష్మి(26)తో 20 నెలల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్త అదనపు కట్నం తేవాలని వేధించారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి సర్ది చెప్పినా మార్పు రాలేదు. దీంతో లక్ష్మి శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలికి 10 నెలల పాప ఉంది.

News November 17, 2025

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.

News November 17, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన ‘చలి పులి’

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్, బిజినపల్లిలో అత్యల్పంగా 10.9 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 11.2, పదరలో 11.5, ఐనోల్ 11.6, అచ్చంపేట 11.7, ఊర్కొండలో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.