News May 3, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

image

జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.

Similar News

News November 22, 2025

కలెక్టర్ సిరి హెచ్చరిక

image

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

News November 22, 2025

కె.నాగలాపురం పోలీస్ స్టేషన్‌‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

image

కె.నాగలాపురం పోలీసు స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.

News November 22, 2025

కె.నాగలాపురం పోలీస్ స్టేషన్‌‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

image

కె.నాగలాపురం పోలీసు స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.