News March 28, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు

image

ఏపీలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి నలుగురికి అవకాశం వరించింది. వారిలో నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అంగజాల గీత, పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నబి సాహెబ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కురువ మల్లయ్య ఉన్నారు.

Similar News

News November 17, 2025

బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్

image

‘ఎమోజీ’ వివాదం ముదరడంతో హీరో బాలకృష్ణకు TG హోంశాఖ స్పెషల్ CS సీవీ ఆనంద్ క్షమాపణ చెప్పారు. 2 నెలల కిందట పైరసీ, బెట్టింగ్ యాప్‌ల విషయంపై టాలీవుడ్ ప్రముఖులతో ఆనంద్ సమావేశం నిర్వహించి Xలో ఓ పోస్టు చేశారు. అయితే ఈ భేటీకి బాలయ్యను ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఆనంద్ X ఖాతాను హ్యాండిల్ చేసే వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన పోస్టును తొలగించి సారీ చెప్పారు.

News November 17, 2025

NGKL: చివరి కార్తిక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

image

చివరి కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి, సందడి వాతావరణం నెలకొంది.

News November 17, 2025

కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న హైదరాబాదీలు

image

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మారేడుపల్లిలో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2℃గా నమోదైంది. అటు బహదూర్‌పుర, బండ్లగూడ, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్ 13.2, తిరుమలగిరి 13.6, గోల్కొండ, ముషీరాబాద్ 14.4, షేక్‌పేట్ 15.2, అమీర్‌పేట్, ఖైరతాబాద్ 15.6, సికింద్రాబాద్లో 16℃గా నమోదైంది.