News March 28, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు

image

ఏపీలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి నలుగురికి అవకాశం వరించింది. వారిలో నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అంగజాల గీత, పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నబి సాహెబ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కురువ మల్లయ్య ఉన్నారు.

Similar News

News September 17, 2025

‘అరబ్-ఇస్లామిక్’ NATO.. భారత్‌కు నష్టమా?

image

ఖతర్‌‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్, ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా <<7824953>>NATO<<>> తరహాలో అరబ్-ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్‌‌కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉద్ధృతం చేసే ప్రమాదముంది.

News September 17, 2025

సిరిసిల్ల: నిస్వార్థ నాయకుడు అమృతలాల్ శుక్లా

image

అమృతలాల్ శుక్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఉపాధ్యాయ వృత్తిని వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడారు. సామాన్య ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడారు. పేదల కోసం భూ పంపిణీ ఉద్యమాలు, వెట్టిచాకిరి నిర్మూలన కోసం కృషి చేశారు. ఆయన ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు. 1957లో సిరిసిల్ల MLA గా అమృతలాల్ ఎన్నికయ్యారు.

News September 17, 2025

తుంగతుర్తి: తెగువ చూపి విప్లవాన్ని రగిల్చారు..

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దళ నాయకుడిగా పనిచేసి తెగువతో విప్లవాన్ని రగిలించిన నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, సామాజిక న్యాయం కోసం, పేదల బతుకులు బాగు చేసేందుకు ఆయన పోరాడారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని పరితపించేవారు. మచ్చలేని పార్లమెంట్ సభ్యుడిగా గడిపిన ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.