News May 3, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.
Similar News
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త.!

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.
News December 6, 2025
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.


