News April 10, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News March 17, 2026

సంగారెడ్డి: పిల్లలను ఈతకు పంపవద్దు: ఎస్పీ

image

ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను ఈతకు పంపవద్దని ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెరువులు కుంటల వద్ద పిల్లలకు లోతు తెలియకపోవడంతో మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని సూచించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.

News March 17, 2026

ఆసిఫాబాద్: ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం!

image

ఎస్సీ యువతీ యువకులకు 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 17, 2026

ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలి: కలెక్టర్

image

బాపట్లలో సోమవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఎంజిఎన్ఆర్ఈజీఎస్, గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వెనుకబడిన మండల అధికారులను ప్రశ్నిస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంఏవై పథకంలోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.