News June 15, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త

image

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ప్రతిపక్ష హోదాలో టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ శాఖ మన జిల్లా మంత్రికి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 7, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 6, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 6, 2026

కర్నూలు: ‘సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలి’

image

సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలని రాష్ట్ర BC వెల్ఫేర్ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. కర్నూలులోని సునయన ఆడిటోరియంలో మంగళవారం కర్నూలు, కడప, అనంతపురం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.