News June 4, 2024

ఉమ్మడి కృష్ణాలో భారీ ఆధిక్యంలో ఉన్నది వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా 51,360 ఓట్లు, విజయవాడ తూర్పులో గద్దె రామమోహన్ 39,016, పెనమలూరులో బోడె ప్రసాద్ 36,544 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు వెలంపల్లి, జోగి రమేశ్ విజయవాడ సెంట్రల్, పెనమలూరులో ఓటమి బాటలో ఉన్నారు.

Similar News

News October 23, 2025

ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన గోదాములు, తూకం యంత్రాలు, తడి ధాన్యం ఆరబెట్టే వసతులు, రైతులకు తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 23, 2025

కృష్ణా: రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు, మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, వీఆర్వోలు సర్వేయర్లతో కలిసి జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు.

News October 23, 2025

ఉయ్యూరు: అత్యాచార నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

image

ఉయ్యూరులో రెండు రోజుల క్రితం బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు చాంద్ బాషాను పోలీసులు గురువారం నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచే నిమిత్తం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు సంకెళ్లతో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితుడిని రోడ్డుపై తీసుకెళ్తుంటే జనాలు బారులు తీరి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థించారు.