News March 10, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురికి నిరాశే.!

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కూటమి నేతలకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదురుచూపులు ఫలించలేదు. పదవి తప్ప కుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మడి జిల్లాలో ఒక రెండు ఎమ్మెల్సీలు లభిస్తాయని అంతా ఊహించినా లెక్కతప్పింది. అధిష్ఠానం ఒక్కటీ కేటాయించలేదు. దీంతో నిరాశ చెందారు.
Similar News
News March 10, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉన్న VFX పనులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.
News March 10, 2025
రిటైర్మెంట్ వార్తలు.. స్పందించిన జడేజా

వన్డేలకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఖండించారు. తన రిటైర్మెంట్పై వస్తున్న రూమర్స్ నమ్మవద్దని అభిమానులను కోరాడు. థాంక్స్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. దీంతో తదుపరి వరల్డ్ కప్ వరకు జడ్డూ భారత జట్టుకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.
News March 10, 2025
PDPL: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణ రాయితీ: ఎ.కీర్తి కాంత్

రుణ రాయితీతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని పెద్దపల్లి జిల్లా పరిశ్రమల అధికారి ఎ.కీర్తి కాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ఆదేశాలకు ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీం లో భాగంగా 35 శాతం రుణ రాయితీ రుణాల మంజూరు కోసం మార్చి12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.