News March 18, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ల మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనిని ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Similar News

News April 25, 2025

పోప్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి

image

ఈనెల 21న కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఇవాళ వాటికన్ సిటీ వెళ్లనున్న ఆమె రేపు అంత్యక్రియల్లో పాల్గొంటారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపం తెలుపుతారని వెల్లడించింది.

News April 25, 2025

మార్కాపురం: ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు’

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

News April 25, 2025

సిద్దిపేట: మహిళ ప్రాణం తీసిన పిడుగు

image

పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన బెజ్జంకిలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎడ్ల బండి చౌరస్తా సమీపంలోని ఓ చింత చెట్టు సమీప ప్రాంతంలో పిడుగు పడగా దగ్గర ఉన్న టేకు రంగవ్వ (68) మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త శంకరయ్య, కుమారులు, కూతుర్లు ఉన్నారు. అదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడు టేకు హరీశ్ స్పృహ తప్పి పడిపోగా చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.

error: Content is protected !!