News February 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ

నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్, KMM-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి సైతం నిధులు కేటాయించాలని కోరారు.
Similar News
News February 16, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.
News February 16, 2025
బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News February 16, 2025
పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలి: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలని… వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. డిజిటల్ భూసర్వేకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని అన్నారు.