News August 4, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

✓ ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
✓కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి తుమ్మల సమీక్ష
✓నా చివరి శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే
✓మణుగూరులో రెండున్నర కిలోల గంజాయి పట్టివేత
✓రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు: మంత్రి పొంగులేటి
Similar News
News February 25, 2026
ఖమ్మం: టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. మంగళవారం డీఈఓ చైతన్య జైనీతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, వెలుతురు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 25, 2026
ఖమ్మం: సైబర్ ట్రాఫికింగ్పై అప్రమత్తత అవసరం

మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్పై అంగన్వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి విజేత పిలుపునిచ్చారు. ‘ప్రజ్వల’ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేమ, ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె సూచించారు.
News February 25, 2026
వెలుగుమట్ల భూదాన్ భూములు స్వాధీనం: అదనపు కలెక్టర్

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మినహాయించిన నిర్మాణాలు మినహా, మిగిలిన 308 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల సామాగ్రిని అంబేద్కర్ భవనంలో భద్రపరిచామని ఆయన వెల్లడించారు.


