News October 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో జాబ్ మేళ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

Similar News

News October 16, 2025

ఖమ్మం: ‘వైద్య పరీక్షలకు బయటకు పంపితే కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నెలకు కనీసం 200 ప్రసవాలు, ఓపీ కేసుల్లో 60% పరీక్షలు చేయాలన్నారు. వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన పరికరాల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు.

News October 16, 2025

రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు(శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇంఛార్జి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 10:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. అనంతరం అధికారులతో నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

News October 16, 2025

నేర దర్యాప్తులో ఆధారాలు కీలకం: CP సునీల్ దత్

image

నేర దర్యాప్తులో ఆధారాలు చాలా కీలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో గల భవనంలోని ఆధునికరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, ఫింగర్ ఫ్రింట్ యూనిట్లలోని కార్యాచరణను వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు.