News November 27, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరుల విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
Similar News
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.
News November 16, 2025
KMM: మహిళా డెయిరీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా: కలెక్టర్

ఇందిరా మహిళా డెయిరీ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్షించిన ఆయన, నిబంధనలను తప్పక పాటించాలని, పశువుల యూనిట్లు అక్రమంగా అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.5వేల మంది లబ్ధిదారులకు 10 వేల పశువుల పంపిణీకి కట్టుదిట్టమైన నిర్వహణ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 15, 2025
ఖమ్మం: పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం: మంత్రి తుమ్మల

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్లో చేప పిల్లలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. నగర పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పని చేయాలన్నారు. ప్లాస్టిక్, చెత్త కారణంగా దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సహా అధికారులు పాల్గొన్నారు.


