News January 14, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News November 24, 2025
ఖమ్మం జిల్లాలో లక్ష నుంచి 30వేల ఎకరాలకు

ఖమ్మం జిల్లాలో మూడేళ్లుగా మిర్చిసాగు క్రమంగా తగ్గుతోంది. ధర, దిగుమతి లేకపోవడంతో రైతులు విముఖత చూపుతున్నారు.2020లో జిల్లాలో 1,08లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు. 2023లో 92,274, 2024లో 59.205, ఈ ఏడాది 31,741ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 3ఏళ్ల క్రితం క్వింటా రూ. 25వేలు పలికింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుతం రూ. 15వేల లోపే ఉంది. చైనాలో మిర్చిసాగు పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
News November 24, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు 5,214 పోలింగ్ స్టేషన్లు, 6,258 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులకు సుమారు14,092మంది సిబ్బంది అవసరమని గుర్తించి, శిక్షణ పూర్తి చేశారు. వీరిలో పోలీంగ్ ఆఫీసర్లు 6,258, ఓపీవోలు 7,834 మందిని నియమించారు.
News November 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం


