News June 3, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం లోక్సభ ఎన్నికలు కౌంటింగ్పై కలెక్టర్ గౌతమ్ సమీక్ష
∆} చింతకాని మండలంలో పవర్ కట్
∆} ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు
Similar News
News October 26, 2025
ఓటర్ల జాబితా పకడ్బందీగా పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీసీ ద్వారా సమీక్షించారు. ఎస్.ఐ.ఆర్. జాబితా పూర్తి, 2002–2025 మధ్య కొత్త ఓటర్ల వివరాలను బూత్ స్థాయిలో ధృవీకరించాలని కలెక్టర్ను ఆదేశించారు. బూత్ అధికారులు BL0 యాప్ ద్వారా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
News October 25, 2025
పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.
News October 25, 2025
సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.


