News July 14, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

> పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
> కొత్తగూడెంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> వెంకటాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> సత్తుపల్లి సింగరేణి ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరం
> నేలకొండపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
> బయ్యారంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సమ్మేళనం
> మధిరలో సీపీఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులు
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
Similar News
News November 13, 2025
దానవాయిగూడెం గురుకులంను మోడల్గా మారుస్తాం: పొంగులేటి

దానవాయిగూడెం టీ.జీ.ఎస్.డబ్ల్యు.ఆర్ బాలికల గురుకులాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాఠశాల, కళాశాల భవన మరమ్మతులకు రూ.3.80 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భవన మరమ్మతులు, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, క్రీడా మౌలిక వసతుల పనులకు మంత్రి కలెక్టర్తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అధికారులు పాల్గొన్నారు.
News November 12, 2025
87% బిల్లులు డిజిటల్తోనే: ఖమ్మం ఎస్ఈ

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్లైన్లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 12, 2025
వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.


