News April 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యాంశాలు

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
Similar News
News April 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మం జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముదిగొండ (బాణాపురం)లో 41.5, నేలకొండపల్లిలో 41.3, ఎర్రుపాలెంలో 41.0, చింతకాని, మధిరలో 40.9, కామేపల్లి (లింగాల), కారేపల్లిలో 40.7, రఘునాథపాలెం, వేంసూరులో 40.3, వైరా 40.2, సత్తుపల్లి 40.0, పెనుబల్లి 39.9, ఖమ్మం అర్బన్ 39.7, తిరుమలాయపాలెం 39.4, ఖమ్మం (R) పల్లెగూడెం 39.2, తల్లాడ 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 21, 2025
ఖమ్మం: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు రేపు విడుదల చేయనుంది. జిల్లాలో మొదటి సంవత్సరంలో 17,783 మందికి గాను 17,515 మంది, రెండవ సంవత్సరంలో 16,476 మందికి గాను 16,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 21, 2025
మధిర: వడదెబ్బకు సొమ్మసిల్లి వ్యక్తి మృతి

వడదెబ్బకు సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య(33)మేకలు మేపేందుకు పొలానికి వెళ్లాడు. సోమవారం అధిక ఎండలతో మధ్యాహ్నం ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.