News August 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,313 టన్నుల యూరియా దిగుమతి

image

ఖమ్మంకు రైల్వే వ్యాగన్ల ద్వారా సోమవారం
1,313 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయింది. ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన ఈ యూరియాను ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదాంలకు ఇక్కడ నుంచి లారీల్లో పంపించారు. భద్రాద్రి జిల్లాకు 700 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాకు 313, మహబూబాబాద్ జిల్లాకు 300 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపించామని అధికారులు తెలిపారు.

Similar News

News December 6, 2025

సేంద్రియ సాగు శిక్షణకు వంద మంది రైతులు: మంత్రి తుమ్మల

image

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. సేంద్రియ సాగు ప్రోత్సాహంపై ఏపీలోని పినగూడూరు లంకలో జరగనున్న శిక్షణ శిబిరానికి ఖమ్మం జిల్లా నుంచి 100 మంది రైతులను పంపాలని మంత్రి ఉద్యానవన శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రతినిధులు కోరారు.

News December 6, 2025

సేంద్రియ సాగు శిక్షణకు వంద మంది రైతులు: మంత్రి తుమ్మల

image

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. సేంద్రియ సాగు ప్రోత్సాహంపై ఏపీలోని పినగూడూరు లంకలో జరగనున్న శిక్షణ శిబిరానికి ఖమ్మం జిల్లా నుంచి 100 మంది రైతులను పంపాలని మంత్రి ఉద్యానవన శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రతినిధులు కోరారు.

News December 5, 2025

‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

image

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.