News April 9, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BJP పాగా వేసేనా?

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై గురి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా వారు దూకుడు పెంచారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లోనూ గతంలో కంటే మెరుగైన ఓట్ల శాతం రాబట్టింది. ఎంత వరకు విజయం వరిస్తుందో చూడాలి. దీనిపై మీ కామెంట్..
Similar News
News November 26, 2025
సిరిసిల్ల: ‘టీ పోల్లో పంచాయతీ రిజర్వేషన్ వివరాలు’

గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టీ-పోల్లో అప్లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి పాల్గొన్నారు.
News November 26, 2025
సిరిసిల్ల: ‘టీ పోల్లో పంచాయతీ రిజర్వేషన్ వివరాలు’

గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టీ-పోల్లో అప్లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి పాల్గొన్నారు.
News November 26, 2025
ప్రింటర్లకు నోటీసులు జారీ చేయాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రింటర్లకు నోటిసులు జారీ చేయాలని, అనుమతి లేకుండా ఎటువంటి రాజకీయ సంబంధ నోటిసులు ముద్రణ చేయవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఎన్నికల సంబంధించి బిల్లులు వెంటనే సమర్పించాలని, కలెక్టరేట్లో జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రి మండల స్థాయిలో అందుబాటులో పెట్టాలని పేర్కొన్నారు.


