News April 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} వివిధ శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
∆} ఖమ్మం నగరంలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} కల్లూరు మండలంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
..

Similar News

News January 20, 2025

నేటితో ముగియనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

image

భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 31న వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 20 రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు అవతారాల్లో రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. జనవరి 26న విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవ కేవలం భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం.

News January 20, 2025

సుందరీకరణ వైపు మన ఖమ్మం ఖిల్లా

image

మన ఖమ్మం ఖిల్లా కొత్త శోభ సంతరించుకోనుంది. పర్యటక రంగంగా పేరు ఉన్నప్పటికీ, సందర్శనకు ఆకట్టుకునే పరిస్థితి లేకపోవడంతో పాలకులు దృష్టి సారించారు. కొన్ని సంవత్సరాల తరువాత అభివృద్ధి పనులు సాగడంతో, ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావిస్తున్నారు. ఖమ్మం ఖిల్లా పనులు పూర్తయితే, జిల్లా వాసులే కాక, ఇతర ప్రాంత పర్యటకులు ఇక్కడకి క్యూ కట్టడం ఖాయమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

News January 19, 2025

వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తాం: Dy.CM భట్టి

image

తెలంగాణలో ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ అమలవుతుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భట్టి మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు.