News September 26, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
✓ వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ నేడు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ అశ్వాపురంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
✓ నేడు సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
✓ నేడు ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓మధిర పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News September 30, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పాత పత్తి ధర రూ.7,600 జెండా పాట పలికింది. అలాగే, క్వింటా కొత్త పత్తి ధర రూ.7,011 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర,కొత్త పత్తి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
News September 30, 2024
క్వింటా పత్తికి రూ.500 మద్దతు ధర పెంపు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. HYDలో RR, KMM,VKB, MDCL సహా ఇతర జిల్లాలకు చెందిన అధికారులతో CCI సమావేశంలో పలు సూచనలు చేశారు. వారానికి 6 రోజులు కేంద్రాలు పని చేయనున్నాయని పేర్కొన్నారు. ఈసారి మద్దతు ధర రూ.500 పెరిగినందున కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
News September 30, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధర ఎంతంటే
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సెలవులు అనంతరం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆదివారం క్వింటా ఏసీ మిర్చి ధర 20వేల రూపాయలు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయ విక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.