News September 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

☆ నేడు వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరా
☆ ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ అశ్వారావుపేట నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే జారే పర్యటన
☆ ఉమ్మడి జిల్లాలో నేడు మోస్తారు వర్షాలు
☆ భద్రాద్రి రామాలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ అన్నపురెడ్డిపల్లిలో నేడు జోనల్ స్థాయి క్రీడా పోటీలు
☆ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బిజెపి, కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
☆ ఖమ్మం జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్ పర్యటన

Similar News

News December 11, 2025

6 వేల మందికి పైగా బైండోవర్ చేశాం: ఖమ్మం సీపీ

image

జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే 6 వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.

News December 11, 2025

ఖమ్మం జిల్లాలో తొలి సర్పంచి విజయం

image

రఘునాథపాలెం మండలంలో ఓ సర్పంచ్ ఫలితం వెలువడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో లచ్చిరాం తండాలో ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మాలోతు సుశీల వైపు మొగ్గు చూపారు. 42 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

News December 11, 2025

ఖమ్మం: ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్న ఓటర్లు

image

జిల్లా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. చక్రాల కుర్చీలో వృద్ధులు, చంటిబిడ్డలతో మహిళలు సైతం పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా, మొత్తంగా చాలా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.