News April 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురి నామినేషన్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురువారం అసెంబ్లీ స్థానానికి పలువురు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున నరసరావుపేట-చదలవాడ అరవిందబాబు, మంగళగిరి- నారా లోకేశ్ ఉన్నారు. వైసీపీ తరఫున బాపట్ల- కోన రఘుపతి ఉన్నారు. పిరమిడ్ పార్టీ వినుకొండ-రమణ, పెదకూరపాడు-మల్లిఖార్జున రావు, కాంగ్రెస్ తరఫున-నాగేశ్వరరావు, జాతీయ జనసేన పార్టీ నరసరావుపేట-గోదా రమేశ్, టీడీపీ నరసరావుపేట ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలు.

Similar News

News April 20, 2025

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

image

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.

News April 20, 2025

ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్: డీఈఓ

image

నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.

News April 20, 2025

అమరావతి ప్రధాని పర్యటనకు స్పెషల్ అధికారుల నియామకం

image

ప్రధాని పర్యటనలో విధులు నిర్వహించేందుకు 31 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసే బాధ్యత వారిదే . రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి.వీరపాండియన్ ఉన్నారు. పీఎంవో, ఎస్పీజీ, సీఎంవోలతో సమన్వయం చేసుకోటానికి శాంతిభద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ప్రధాని రోడ్, బహిరంగ సభ, వీఐపీల బాధ్యతలు అప్పగిస్తూ ఆయనకు ఆదేశాలిచ్చారు.

error: Content is protected !!