News May 21, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటు వేశారని మంత్రి అంబటి, తదితర నేతలు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని యరపతినేని, ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీది ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 24, 2025

మహిళా సంఘాల విజయ గాథలు ‘అవని’: కలెక్టర్

image

మెప్మా మహిళా సంఘాలు సాధించిన విజయగాధలు ‘అవని’ సంచికలో మనమందరం చదవి స్ఫూర్తి పొందవచ్చని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెప్మా వార్షిక సంచిక ‘అవని’ కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, కొత్త అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగాలన్నారు.

News November 24, 2025

GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

image

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.

News November 24, 2025

పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్‌లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.