News January 28, 2025

ఉమ్మడి గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి, TGSERIS అలుగునూరు COEలలో 9వ తరగతి,TGSERIS ఖమ్మం, పరిగి SOE లలో 8వ తరగతి,TGSERIS రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్స్ ఆర్ట్స్ స్కూల్‌లలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తెలిపారు.

Similar News

News December 5, 2025

వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం: DAO

image

PDPL వ్యవసాయశాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందని DAO శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంటావశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్‌ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గి, పంటల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. రైతులు ఈ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News December 5, 2025

గురు భవానీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఈవో

image

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. డిసెంబర్ 11–15 వరకు సేవలందించే గురు భవానీలు తప్పనిసరిగా గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం Google Play Storeలో Bhavani Deekshalu యాప్ అందుబాటులో ఉందని, గుర్తింపు పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు.

News December 5, 2025

JGL: 941మంది సర్పంచ్ స్థానాలకు పోటీ

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 14న జరిగే 2 విడత ఎన్నికల్లో జరిగే 7మండలాల్లో మొత్తం 144 సర్పంచ్, 1276 వార్డు స్థానాలు ఉన్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 144 సర్పంచి స్థానాలకు గాను, మొత్తం 941 మంది, అలాగే 1276 వార్డు స్థానాలకు గాను, మొత్తం 2927 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 14న జరిగే 2వ విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.