News January 28, 2025

ఉమ్మడి గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి, TGSERIS అలుగునూరు COEలలో 9వ తరగతి,TGSERIS ఖమ్మం, పరిగి SOE లలో 8వ తరగతి,TGSERIS రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్స్ ఆర్ట్స్ స్కూల్‌లలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తెలిపారు.

Similar News

News July 8, 2025

పెద్దపల్లి: పీఎం కుసుమ్ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

image

పీఎం కుసుమ్ పథకం అమలుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జులై నెలాఖరు వరకు PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఆసక్తి గల లబ్ధిదారుల ఎంపికతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం కోసం భూమి లెవెలింగ్ పనులను 9నెలల్లో పూర్తి చేయాలన్నారు. సబ్సిడీ ఉంటుందన్నారు.

News July 8, 2025

పవన్ కళ్యాణ్ ఆగ్రహం

image

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.

News July 8, 2025

కోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కోడూరు మండలం చిట్వేలి ప్రధాన రహదారి గంధంవడ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. కోనేటి పెంచలయ్య (45) కోడూరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి మోటార్ బైక్‌పై చిట్వేలి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.