News April 15, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Similar News

News October 27, 2025

ప్రాణ నష్టం 0 లక్ష్యంగా అధికారులు పనిచేయాలి: స్పెషల్ ఆఫీసర్

image

ప్రాణ నష్టం 0 లక్ష్యంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌ను ఏ అధికారి వృథా చేయకుండా పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధరబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ, ఇన్‌ఛార్జ్ కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెంథా తుపాను ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్నారు. ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News October 27, 2025

పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

image

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>

News October 27, 2025

సింగర్ మృతి.. చివరి సినిమాకు భారీ క్రేజ్

image

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ SEP 19న సింగపూర్‌లో <<17805488>>మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్ నటించి, మ్యూజిక్ అందించిన చివరి సినిమా ‘రోయ్ రోయ్ బినాలే’ OCT 31న విడుదలవుతోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా గంటలోనే 15K+ అమ్ముడయ్యాయి. BMSలో ఇప్పటివరకు 98K+ ఇంట్రస్ట్‌లు నమోదయ్యాయి. దీంతో ఇది ₹100CR గ్రాస్ కలెక్షన్స్ సాధించే తొలి అస్సామీ సినిమాగా నిలిచే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.