News April 2, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీళ్లే..

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * తంబళ్లపల్లి- చంద్రశేఖర్ రెడ్డి * పీలేరు- సోమశేఖర్ రెడ్డి * మదనపల్లె-పవర్ కుమార్ రెడ్డి * పుంగనూరు- మురళీమోహన్ యాదవ్ * చంద్రగిరి- కనుపర్తి శ్రీనివాసులు * శ్రీకాళహస్తి- రాజేశ్ నాయుడు * సత్యవేడు (SC) – బాలగురువం బాబు * నగరి- పి రాకేశ్ రెడ్డి * చిత్తూరు- తికరామ్ * పలమనేరు- శివశంకర్ *
కుప్పం- ఆవుల గోవిందరాజులు

Similar News

News September 15, 2025

రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్‌పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్‌పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 15, 2025

కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.

News September 15, 2025

చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.