News June 14, 2024

ఉమ్మడి జిల్లాలో చల్లబడ్డ వాతావరణం..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్లో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 32.7, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 32.4, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 31.8, గద్వాల జిల్లా అల్వాలపాడు 29.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 22, 2025

MBNR: డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఉపకులపతి

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి నిర్వహించి డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కేంద్రాలకు వెళ్లే ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్‌లకు ఆర్డర్ కాపీలను అందజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కంట్రోలర్ డా కె ప్రవీణ తెలిపారు.

News November 22, 2025

MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (MDCA) రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. ఈనెల 24న మహబూబ్ నగర్‌లోని క్రికెట్ స్టేడియంలో (పిల్లలమర్రి) ఎంపికలు ఉంటాయని, 1.9.2011 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో హాజరు కావాలన్నారు.
#SHARE IT.

News November 22, 2025

మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

image

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్‌లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్‌లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.