News January 12, 2025
ఉమ్మడి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం గం.8.30 AM వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్, కల్హేర్ 15.6, జహీరాబాద్, ఆందోల్, కోహిర్ 15.9, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట్ 16.2, మనోహరాబాద్ 16.7, రేగోడ్ 16.8, తూప్రాన్ 16.9, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 16.0, మార్కూక్ 16.2, ములుగు 16.3, మద్దూరు 16.5 °C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Similar News
News February 12, 2025
మెదక్: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
నర్సాపూర్: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో దులానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
మెదక్: 21 మండలాలు, 190 ఎంపిటిసి స్థానాలు

మెదక్ జిల్లాలో 21 మండలాల్లో జెడ్పిటిసి, 190 ఎంపిటిసి స్థానాలున్నాయి. ఈనెల 15న ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 5,23,966 మంది ఉన్నారు. పురుషులు 2,52,279 మంది, మహిళలు 2,71,878 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. నామినేషన్ల కోసం 70 కేంద్రాల్లో 91 మంది ఆర్ఓలు, జెడ్పిటీసి ఎన్నికల కోసం 21+4 రిటర్నింగ్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు.