News August 5, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..
> MLG: జిల్లాలో స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క> WGL: రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొండా సురేఖ > JN: హాట్ సీటుగా కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవి> HNK: కాళోజీ కళా క్షేత్ర పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ> MHBD: కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన MLA లు కడియం శ్రీహరి, మురళినాయక్ > HNK: ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రత్యేక ఫోకస్ పెట్టాలి: ఎంపీ కావ్య
Similar News
News October 1, 2024
WGL: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.
News October 1, 2024
వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
News October 1, 2024
డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన నల్లబెల్లి వాసులు
నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో నల్లబెల్లి మండల వాసులు సత్తాచాటారు. నల్లబెల్లికి చెందిన మూటిక ప్రవళిక స్కూల్ అసిస్టెంట్ సైన్స్ విభాగంలో 2 వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 7 వ ర్యాంకు కొండ్లె వినయ్, 14వ ర్యాంకు రాయరాకుల రాజేష్, 54వ ర్యాంకు కొండ్లె నాగలక్ష్మి, నారక్క పేట నుండి 70వ ర్యాంక్ వైనాల రవి, 73వ ర్యాంకు అనుముల శ్రీలత డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వీరిని బంధువులు అభినందించారు.