News August 28, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

✒WNPT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
✒మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
✒పలు మండలాల్లో రుణమాఫీఫై స్పెషల్ డ్రైవ్
✒వక్ఫ్ భూములపై ఫిర్యాదులు JPC కమిటీకి వివరిస్తా: డీకే అరుణ
✒నాగర్కర్నూల్: సెప్టెంబర్ 3న ఉద్యోగ మేళా
✒హైడ్రా.. పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్
✒ఓటు హక్కును నమోదు చేసుకోండి: MROలు
✒గణపతి, మీలాద్-ఉన్-నబి శాంతియుతంగా జరుపుకోండి: SIలు
✒DSC 508 ఖాళీలు..14,577 మంది ఎదురుచూపు
Similar News
News April 24, 2025
వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.
News April 24, 2025
MBNR: ‘భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి’

జిల్లాలో భూగర్భ జిల్లాలో అడుగంటకుండా వాటిని పెంచేందుకు వర్షపు నీటి సంరక్ష నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో నీటి నియంత్రణపై ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
News April 24, 2025
మిడ్జిల్: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

మిడ్జిల్ మండల్ మల్లాపూర్లో నేడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వడ్ల తేమ శాతం చూశారు. రైతులతో మాట్లాడుతూ.. సన్నాళ్లకు బోనస్ అందుతున్నాయా అని, తేమ శాతం వచ్చే విధంగా ఆరబెట్టాలని, రైతులకు కల్లాలకు స్థల పరిశీలన, సరిపడా టార్పాలిన్ ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో, ఏపీఎంకి సూచించారు.