News February 7, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔MBNR:రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి✔GDWL:ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ మృతి✔కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య✔బాలానగర్:గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య✔కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన బోగస్:BJP✔పెండింగ్ చలాన్లు కట్టేయండి:SIలు✔నారాయణపేటలో సినిమా షూటింగ్✔పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి:కలెక్టర్లు✔GDWL: కన్నుల పండుగగా మధ్వనవమి పూజలు

Similar News

News February 7, 2025

బాలానగర్‌: విద్యార్థి మృతి.. కేసు నమోదు

image

బాలానగర్ మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థి ఆరాధ్య ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి గురువారం మధ్యాహ్నం విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థి తండ్రి కొమ్ము రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లెనిన్ గౌడ్ తెలిపారు.

News February 6, 2025

BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.

News February 6, 2025

MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా న్యూ టౌన్‌లో జరిగింది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. బైక్‌పై వెళుతున్న ఇద్దరూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!