News April 1, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS!

✔ఘనంగా రంజాన్ వేడుకలు✔రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు✔నర్వలో పేకాట రాయులు అరెస్ట్✔ఈద్గా వద్ద నాయకుల సందడి✔MBNR:వడగండ్ల వాన..ఆరెంజ్ అలెర్ట్ జారీ✔బిజినేపల్లి: ఏప్రిల్ 9న పూలే విగ్రహావిష్కరణ✔రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు✔NRPT:BRSలో చేరిన కాంగ్రెస్ నేతలు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔జడ్చర్లలో వృక్షాలపై గొడ్డలి వేటు
Similar News
News December 1, 2025
అఫ్గాన్తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

అఫ్గాన్తో ట్రేడ్ వార్ పాక్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.
News December 1, 2025
మేడారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవు: సీఎం

మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్తపతి శివనాగిరెడ్డితో సమన్వయం చేసుకుంటూ, సంప్రదాయాలు పాటిస్తూ నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, భక్తుల విడిది, దర్శన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.
News December 1, 2025
100% పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్

PDPL పట్టణంలో అభివృద్ధి పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సమీక్షించారు. టి.యూ.ఎఫ్.ఐ.డి.సి కింద పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పాత వాటర్ ట్యాంకర్ కూల్చాలని, కొత్త ట్యాంకర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్లను 100% వసూలు చేయాలని, చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. ఉల్లంఘనలకు జరిమానాలు విధించాలన్నారు.


