News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

Similar News

News November 7, 2025

త్వరలో 2,837 కంప్యూటర్​ టీచర్​ జాబ్స్​!

image

TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ITలో శిక్షణ ఇచ్చేందుకు 2,837 కంప్యూటర్ టీచర్లను (ICT Instructors) నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 5 కంప్యూటర్ల కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లలో వీరిని నియమించి, నెలకు రూ.15వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారని సమాచారం. ఔట్‌‌సోర్సింగ్​ ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఇప్పటికే CMకు పంపగా, ఆయన ఆమోదం తర్వాత నోటిఫికేషన్ రానుంది.

News November 7, 2025

ఫర్నిచర్ శిక్షణకు మరో అవకాశం: భద్రాద్రి కలెక్టర్

image

హైదరాబాద్‌తో పాటు రాజమండ్రిలో కూడా ఫర్నిచర్ శిక్షణకు అవకాశం లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. హైదరాబాద్ శిక్షణకు ఇప్పటికే 19 మంది ఎంపిక కాగా, అదనంగా రాజమండ్రిలో శిక్షణ కోసం మరో 11 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని ఎస్20 (S20)లో జరిగే ఓరియంటేషన్, ఎంపిక పరీక్షకు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

News November 7, 2025

విటమిన్స్ లోపం-లక్షణాలు

image

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్‌, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.