News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

Similar News

News November 28, 2025

పల్నాడు: వెంటపడొద్దు అన్నందుకు చంపేశారు..!

image

బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. రేమిడిచర్లలో శామ్యేల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యువతి తన తండ్రికి చెప్పడంతో ఆయన సదరు యువకుడిని తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి తండ్రిని రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI షమీర్ బాషా తెలిపారు.

News November 28, 2025

జనగామ: గెలుపు గుర్రాలకే సర్పంచ్ టికెట్!

image

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులు సర్పంచ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ, మండల, జిల్లా నాయకులు, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వాలని కొందరు అంటుంటే, గెలిచి గ్రామాలను అభివృద్ధి చేసే వారికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.

News November 28, 2025

NIEPVDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<>NIEPVD<<>>)లో 14 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో M.Phil(క్లినికల్ సైకాలజీ, రిహాబిలిటేషన్ సైకాలజీ), B.Ed.SE, D.Ed.SE, M.Ed.SE, CBID ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. వెబ్‌సైట్: niepvd.nic.in