News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

Similar News

News November 14, 2025

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

image

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. కార్తీక శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.

News November 14, 2025

KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

image

<>KVS,<<>> NVS 14,967 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో అసిస్టెంట్ కమిషనర్ 17, ప్రిన్సిపల్(227), వైస్ ప్రిన్సిపల్ 58, PGT 2,996, TGT 6,215, PRT 3365, లైబ్రరీ సైన్స్ 147, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 12, ఫైనాన్స్ ఆఫీసర్ 5, Asst ఇంజినీర్ 2, ASO 74, Jr ట్రాన్స్‌లేటర్ 8, Sr సెక్రటేరియట్ అసిస్టెంట్ 832, Jr సెక్రటేరియట్ అసిస్టెంట్ 760, స్టెనోగ్రాఫర్ 60, ల్యాబ్ అటెండెంట్ 165, MTS 24పోస్టులు ఉన్నాయి.

News November 14, 2025

కాకినాడ- అనకాపల్లి మధ్య ఎయిర్ పోర్టు: CM

image

ఉమ్మడి తూ.గో జిల్లాలను ఎకనమిక్ రీజియన్‌లో చేర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గురువారం జరిగిన సదస్సులో 3 జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాకినాడ- అనకాపల్లి మధ్య చిన్న ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కడియం నర్సరీలు, పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయాలన్నారు. తలసరి ఆదాయం కోనసీమ రూ.2.09 లక్షలు, కాకినాడ రూ.2.42L, తూ.గో రూ.2.59 లక్షలుగా ఉందన్నారు.