News April 18, 2024
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈరోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. చిట్యాల 44.8, దూల్మిట్ట 44.2, సిద్దిపేట 43.7, కట్కూరు 43.3, కొత్తపేట, దౌల్తాబాద్ 42.6, కొమురవెల్లి, పఠాన్ చెరు 42.4, కల్హేర్, ప్రగతి ధర్మారం 42.3, రాంపూర్ 42.2, రేబర్తి 42.1, సముద్రాల, రామచంద్రపురం, జిన్నారంలో 42.0 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
Similar News
News September 30, 2024
నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం: కలెక్టర్
ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
News September 30, 2024
ఉమ్మడి మెదక్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దిశగా మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రయత్నాలు ఫలించాయి. మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రి సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పలు సమీకరణాలపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
News September 30, 2024
మెదక్: ఉపాధ్యాయుల సర్దుబాటు పునరాలోచించాలి: తపస్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 అమలు విషయంలో పునరాలోచించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా విద్యాధికారికి సోమవారం తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డు ఎల్లం, ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు అల్లం ఆంజనేయులు, నరేందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.