News July 15, 2024
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి !

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటల నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 2, 2025
MBNR: అక్టబర్లో 21 రెడ్హ్యాండెడ్ కేసులు

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
News November 2, 2025
MBNR: జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల అప్పగింత

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ‘AHTU’ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు, కళాశాలలు, గ్రామాల్లో ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు. అధికారులు 30 హాట్స్పాట్ ప్రాంతాలను సందర్శించి సమాచారాన్ని సేకరించారు. కురుమూర్తి జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను గుర్తించి తమతమ కుటుంబాలకు అప్పగించారు.
News November 2, 2025
MBNR: SSC విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆదేశాల మేరకు SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల సమయ పట్టికను రూపొందించామని డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక తరగతులు విద్యార్థుల విద్యాప్రగతిని పెంపొందించి రాబోయే SSC పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉదతయం 8:15 నుంచి 9:15 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు క్లాసులు జరుగుతాయని పేర్కొన్నారు.


