News November 5, 2024
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య ఇదే..

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 727మంది ఉన్నారు. వీరిలో పార్వతీపురం జిల్లాలో 325 మంది ఉండగా, ఇందులో పురుషులు 132, మహిళలు 193 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 239 మంది మహిళా ఓటర్లు, 163 పురుష ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు ముసాయిదా జాబితాపై తమ క్లెయిమ్లు, అభ్యంతరాలను ఈ నెల 8వ తేదీ లోగా తెలియజేయవచ్చు.
Similar News
News November 27, 2025
VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.
News November 26, 2025
ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.
News November 26, 2025
ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.


