News October 1, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా రేమద్దులలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 35.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా దోనూరులో 35.6 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరులో 34.8 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మంగనూరులో 34.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.

Similar News

News January 4, 2026

MBNR: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!

image

సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News January 4, 2026

జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 4, 2026

జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.