News September 25, 2024

ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో బదిలీలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా రవాణా శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు మంగళవారం బదిలీ అయ్యారు. జంగారెడ్డిగూడెం ప్రసాద్‌ను కొవ్వూరు యూనిట్‌ కార్యాలయానికి, కొవ్వూరు బీ.భీమారావును ఏలూరు డీటీసీ కార్యాలయానికి, ఏలూరు ప్రసాద్‌ను పెద్దాపురం, రాజమహేంద్రవరం రంగనాయకులను జంగారెడ్డిగూడెం ఆర్టిఓ కార్యాలయానికి బదిలీ చేశారు.

Similar News

News October 29, 2025

ప.గో. కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.

News October 29, 2025

4,155 మందికి పునరావాసం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.

News October 28, 2025

4,155 మందికి పునరావాసం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.