News March 9, 2026
ఉమ్మడి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీలక్ష్మి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ లెక్చరర్ చేకూరి ఝాన్సీలక్ష్మి నియమితులయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేసినట్లు కార్యదర్శి G.V.S.D ప్రసాద్ తెలిపారు. DNR కాలేజీలో పనిచేసిన ఆమె సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఝాన్సీలక్ష్మికి అభినందనలు తెలుపుతూ సర్వోదయ ఆశయాల పట్ల ఆకాంక్షించారు.
Similar News
News April 13, 2026
ప.గో : ఈ మున్సిపాలిటీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా ?

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు మున్సిపాలిటీలకు సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసులు ఉండటంతో దాదాపు పదేళ్లుగా ఎన్నికలకు నోచుకోలేదు. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది. ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 4 మున్సిపాలిటీలకు కోర్టు కేసులు పరిష్కారం తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News April 12, 2026
ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.
News April 12, 2026
ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.


