News April 16, 2025
ఉమ్మడి తూ.గో.లో 202 పోస్టులు

ఉమ్మడి తూ.గో.జిల్లాలో 202 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 127 SGT (ప్రాథమిక స్థాయి), 75 స్కూల్ అసిస్టెంట్ల (ద్వితీయ స్థాయి) పోస్టులు మంజురైనట్లు అధికారులు తెలిపారు. వీటిని ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News December 5, 2025
భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 5, 2025
KNR: భారీ ఆదాయం.. అయినా సొంత భవనాల్లేవ్..!

అద్దె భవనాలు, అరకొర వసతులతో రవాణా శాఖ అవస్థలు పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఏడాదికి రూ.400 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. అయినా KNR DTO ఆఫీస్ మినహా SRCL, PDPL, JGTL, కోరుట్ల, రామగుండం, HZB కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దీంతో ట్రాకులు లేక గుంతల రోడ్లపైనే డ్రైవింగ్ టెస్టులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి సరైన వసతులు కల్పించాలి.
News December 5, 2025
ఆదిలాబాద్: ‘కాంప్రమైజ్’ రాజకీయాలు

ఉమ్మడి జిల్లాలో ‘కాంప్రమైజ్’ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకే కులం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన పక్షంలో ఒక్కరినే బరిలో ఉంచేందుకు కుల సంఘాల పెద్దలు, వీడీసీ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఒకచోట చేర్చి మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పోటీ నుంచి తప్పుకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు.


