News January 23, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పరిశ్రమలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సదాశివనగర్ మండలం లింగంపల్లిలో జూట్ పరిశ్రమ పనులు కొనసాగుతుండగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. కాగా తాజాగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి జరగనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News October 17, 2025

జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. శుక్రవారం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తికి 34,592 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, భీమా లిఫ్ట్-1 కు 650, లిఫ్ట్ -2 కు 750, ఎడమ కాల్వకు1,030, కుడి కాలువకు 680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 37,773 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

News October 17, 2025

HYD: ECకి నేరచరిత్ర చెప్పని అభ్యర్థులు

image

ఎన్నికల సమయంలో కచ్చితంగా నేర చరిత్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి.. అయితే ఇప్పటి వరకు కొందరు అభ్యర్థులు తమ నేరచరిత్రను చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో HYD నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏడుగురికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే వివరాలు సబ్మిట్ చేశారు. ఇక చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ఏడుగురికి నేరచరిత్ర ఉంటే ముగ్గురే వివరాలు అందించారు.

News October 17, 2025

కేబినెట్ సబ్ కమిటీకి మెట్రో కమిటీ నివేదిక

image

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెట్రో కమిటీ తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మెట్రో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో మాట్లాడుతుంది. సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా విచారించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ తతంగం సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.