News January 23, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పరిశ్రమలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సదాశివనగర్ మండలం లింగంపల్లిలో జూట్ పరిశ్రమ పనులు కొనసాగుతుండగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. కాగా తాజాగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి జరగనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News November 12, 2025
బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.
News November 12, 2025
పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఢిల్లీలో టెర్రరిస్టులు జరిపిన కారు బాంబు దాడిలో మరణించిన భారతీయులకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో కొవ్వొత్తులతో మంగళవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐ కొండపాక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. టెర్రరిజం మానవ మనుగడకు పెనుప్రమాదం అన్నారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కు పాదాన్ని మోపాలని పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, తదితరులున్నారు.
News November 12, 2025
కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో పెండింగ్లోని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను పెండింగ్లో పెట్టొద్దని గట్టిగా చెప్పారు.


