News April 29, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బరిలో ఉండేది ఎవరు…?

image

లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకు సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం నేడు వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

Similar News

News October 24, 2025

దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్య

image

దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు(40) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. మైబు హమాలి పని ముగించుకొని గురువారం రాత్రి 9:30 గంటలకు బైక్ పై ఇంటికి వెళ్తుండగా అడవి అజిలాపూర్ గేటు సమీపంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News October 24, 2025

పాలమూరు: టపాసులు పేలి విద్యార్థులకు గాయాలు

image

టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. పాలమూరు రూరల్ రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. అవి పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.

News October 23, 2025

MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.