News March 20, 2024

ఉమ్మడి ప.గోలో హిందీ పరీక్షకు 45,034 మంది హాజరు

image

ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్ష 24,209 మందికి గానూ 23,452 మంది రాశారు. 757 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1342 మందికి 423 మంది హాజరయ్యారు. 919 మంది గైర్హాజరయ్యారు. అటు ప.గో జిల్లాలో 21,462 మందికి గానూ 20,455 మంది హాజరు కాగా.. 1007 మంది ఆబ్సెంట్ అయినట్లు పేర్కొన్నారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1493 మందికి గానూ 69 మంది ఆబ్సెంట్ అయ్యారు.

Similar News

News November 18, 2025

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 18, 2025

అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

image

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.

News November 18, 2025

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.