News July 26, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాధ్యక్షుడిగా తాడేపల్లిగూడెం వాసి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా DCCB రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏఎస్. సాయిబాబా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ మూర్తి, కార్యదర్శిగా రామారావు, కోశాధికారిగా సూర్యచంద్ర రావు, ఈసీ మెంబర్‌గా రాంబాబు, ఇతర డైరెక్టర్లను ఎన్నుకొన్నట్లు వివరించారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

Similar News

News October 1, 2024

నరసాపురం: రాష్ట్రస్థాయి పోటీలకు 48 మంది ఎంపిక

image

నరసాపురం మండలం ఎల్బీచర్ల అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అండర్-14, 17 రగ్బీ పోటీలకు బాల, బాలికల ఎంపికలు జరిగాయి. ప.గో. జిల్లా వ్యాప్తంగా 110 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ పీఎస్ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు. మొత్తంగా 48 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని, వారు త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News September 30, 2024

ప.గో: విషాదం.. కరెంట్‌ షాక్‌తో ITI విద్యార్థి మృతి

image

ప.గో జిల్లా ఆకివీడులో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో సాయినగర్‌కు చెందిన యారపాటి హేమంత్(19) మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయినగర్‌లో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో హేమంత్‌కు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హేమంత్ ITI చదువుతున్నాడు.

News September 30, 2024

విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్

image

భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.