News July 18, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

image

ఏలూరు రేంజ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 111 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న కొందరిని ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ప.గో జిల్లాలోని పలువురిని కృష్ణా జిల్లాకు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు ఎస్సైలను కృష్ణా, ఏలూరు జిల్లాలకు స్థానచలనం కలిగించారు. NTR పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న పలువురిని ఏలూరు, ప.గో, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు బదిలీ చేశారు.

Similar News

News February 25, 2026

ప.గో: నిరుద్యోగ యువతకు GOOD NEWS

image

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.