News October 12, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో మద్యం షాపులకు 10,848 దరఖాస్తులు

image

ప.గో జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,848 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
భీమవరం- 1,258,
తాడేపల్లిగూడెం-1,222,
తణుకు- 876,
నరసాపురం- 946,
పాలకొల్లు- 873,
ఆకివీడు-240,
ఏలూరు-738,
చింతలపూడి- 783,
భీమడోలు-1,095,
పోలవరం- 597,
జంగారెడ్డిగూడెం-959, అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్దతిలో షాపులను కేటాయించనున్నారు.

Similar News

News November 25, 2025

నిబంధనలు మీరితే కఠిన చర్యలు: కలెక్టర్‌

image

మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో తయారీదారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తయారీ లేదా నిల్వలు చేపడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News November 25, 2025

ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని ప.గో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News November 25, 2025

కంటి ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: కలెక్టర్‌

image

పంచేంద్రియాల్లో నయనాలు ప్రధానమైనవని, ఉద్యోగులు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చూపు విషయంలో అశ్రద్ధ తగదని, వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె పేర్కొన్నారు.