News October 12, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో మద్యం షాపులకు 10,848 దరఖాస్తులు

image

ప.గో జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,848 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
భీమవరం- 1,258,
తాడేపల్లిగూడెం-1,222,
తణుకు- 876,
నరసాపురం- 946,
పాలకొల్లు- 873,
ఆకివీడు-240,
ఏలూరు-738,
చింతలపూడి- 783,
భీమడోలు-1,095,
పోలవరం- 597,
జంగారెడ్డిగూడెం-959, అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్దతిలో షాపులను కేటాయించనున్నారు.

Similar News

News November 14, 2025

ఉండి: ‘దివ్యాంగ పిల్లలను ఆదరించాలి’

image

సమాజంలో ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పిల్లలను ఆదరించాలని సహిత విద్య సమన్వయకర్త టి. శ్రీనివాసరావు అన్నారు. ఉండి నియోజకవర్గం స్థాయిలో ప.గో. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు ఆయన అవగాహన కల్పించారు. MEO వినాయకుడు, భవిత కేంద్రం టీచర్ మధు, ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు.

News November 13, 2025

తణుకులో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్

image

తణుకు పట్టణానికి గురువారం ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

News November 13, 2025

భీమవరంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

image

భీమవరం (M) కొవ్వాడ‌లో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హేమవర్షిని (22) భీమవరంలో బీడీఎస్ చదువుతుంది. మంగళవారం తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయలేదు. స్నేహితులు కొవ్వాడలో ఇంటికి వెళ్లికి చూడగా ఉరివేసుకున్నట్లు గుర్తించి తండ్రి సింహాచలం, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.