News July 19, 2024
ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప.గో కలెక్టర్ సి.నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. SHARE IT..
Similar News
News December 9, 2025
ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.
News December 9, 2025
భీమవరం: Way2News ఎఫెక్ట్.. ఉపాధ్యాయుడి సస్పెండ్

భీమవరం (M) గొల్లవానితిప్ప ZP హైస్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న సుధీర్ బాబును<<18500702>> సస్పెండ్<<>> చేస్తూ DEO నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్టర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈనెల 5న ఆయనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా విచారణకు ఆదేశించామన్నారు. విచారణలో ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై సోమవారం Way2News కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
News December 9, 2025
జిల్లాలో యూరియా కొరత లేదు: ప.గో కలెక్టర్

ప.గో జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పంటకు, యూరియాకు సంబంధించి జిల్లాస్థాయిలో 83310 56742 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.


